తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2751 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 28, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,20,166 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనాతో మరో 9 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 808 కి పెరిగింది. శుక్రవారం నాడు 62,300 శాంపిల్స్ పరీక్షించగా, రాష్ట్రంలో మొత్తం పరీక్షలు సంఖ్య 12,66,643 కు చేరుకుంది.
తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 432, కరీంనగర్ జిల్లాలో 192, రంగారెడ్డిలో 185, నల్గొండలో 147, ఖమ్మంలో 132, మేడ్చల్ లో 128, నిజామాబాద్ లో 113, సూర్యాపేటలో 111, వరంగల్ అర్బన్ లో 101, పెద్దపల్లిలో 97, సిద్దిపేటలో 96, జగిత్యాలలో 88, మంచిర్యాలలో 86, మహబూబాబాద్ లో 75, భద్రాద్రి కొత్తగూడెంలో 72, కామారెడ్డిలో 65, మహబూబ్ నగర్ లో 64, వనపర్తిలో 63, యాదాద్రి భువనగిరిలో 58, నాగర్ కర్నూల్ లో 54 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 28, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 12,66,643
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 1,20,166
- కొత్తగా నమోదైన కేసులు : 2751
- నమోదైన మరణాలు : 9
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 89,350
- కరోనా రికవరీ రేటు: 74.3%
- యాక్టీవ్ కేసులు: 30,008
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 23,049
- మొత్తం మరణాల సంఖ్య : 808
- కరోనా మరణాల రేటు: 0.67%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu