తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2795 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 26, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,14,483 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 8 గురు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 788 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.68 (< 1%) శాతంగా ఉంది.
ఇక కరోనా నుంచి కొత్తగా 872 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 86,095 కి చేరింది. ప్రస్తుతం 27,600 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 75.2 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 449, రంగారెడ్డిలో 268, నల్గొండలో 164, ఖమ్మంలో 152, కరీంనగర్ లో 136, వరంగల్ అర్బన్ లో 132, సిద్దిపేటలో 113, మేడ్చల్ లో 113, నిజామాబాద్ లో 112, మంచిర్యాలలో 106, మహబూబాబాద్ లో 102, జగిత్యాలలో 89, సూర్యాపేటలో 86, పెద్దపల్లిలో 77, భద్రాద్రి కొత్తగూడెంలో 72, కామారెడ్డిలో 55, వనపర్తిలో 55 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu