తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 2 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే సెప్టెంబర్ 16, గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ని ప్రారంభించింది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 16న 3,05,602 మందికి మొదటి డోస్, 1,67,061 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 4,72,663 మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
అలాగే గురువారం రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,04,68,926 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 1,47,96,127 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 56,72,799 మంది లబ్ధిదారులకు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. ఇక 18-44 ఏళ్ల వయసు కేటగిరిలో ఇప్పటికి 78,37,349 మంది మొదటి డోసు, 18,73,917 మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ