తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 10, బుధవారం నాటికీ 2,57,940 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్లైన్ వర్కర్స్ అయిన పోలీసు, మునిసిపల్, పంచాయతీ రాజ్ శాఖ, రెవెన్యూ ఉద్యోగులు మరియు కేంద్ర పోలీసు దళాల సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గురువారం కూడా కొనసాగించి శుక్రవారంతో ముగించనున్నట్టు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు.
ఫిబ్రవరి 10, బుధవారం నాడు 24 జిల్లాల్లో 297 సెషన్స్ లో 14,457 మందికి వ్యాక్సిన్ వేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం రాష్ట్రంలోని 41,850 ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేసేలా లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 35 శాతం (14,457) మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు, ముగ్గురు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ