సుదీర్ఘకాలంపాటు విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందింస్తున్న రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ బలగాలకు కేంద్ర హోమ్ శాఖ “ఉత్కృష్ట్ సేవా పదక్” పతకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పతకాలను ప్రదానం చేసే అధికారాలను కేంద్ర హోమ్ శాఖ రాష్ట్ర డీజీపీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 2020 సంవత్సరానికి గానూ ఐదుగురు ఐపీఎస్ అధికారులకు ఉత్కృష్ట్ సేవా పతకాలను ప్రదానం చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం నాడు సర్క్యులర్ జారీచేశారు. ఉత్కృష్ట్ సేవా పదక్ కు ఎంపికైన వారిలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, హైదరాబాద్ నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్కుమార్, హైదరాబాద్ నగర శాంతిభద్రతల అడిషనల్ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్, హైదరాబాద్ జాయింట్ కమిషనర్లు ఎం రమేశ్ (ఈస్ట్ జోన్), పీ.విశ్వప్రసాద్ (సెంట్రల్ జోన్) ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ