తెలంగాణ రాష్ట్రంలో మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ నేడు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి 1200 పేజీల చార్జ్ షీట్ ను పోలీసులు దాఖలు చేశారు. ప్రణయ్, అమృతల పరిచయం, ప్రేమ, హత్యకు దారితీసిన పలు వివరాలను ఈ ఛార్జ్ షీటులో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో మొత్తం 102 మంది సాక్షులను విచారించినట్టుగా పోలీసులు కోర్టుకు తెలిపారు.
అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రణయ్ మామ మారుతీ రావు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టుగా పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రణయ్ హత్య కేసు విచారణ మార్చ్ 23కి వాయిదా పడింది. విచారణ సందర్భంగా నిందితులు అస్గర్ అలీ, సుభాష్ శర్మ, అబ్దుల్ భారీ, కరీం, శివ, నిజాంలను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. అయితే నిందితుడు మారుతీరావు సోదరుడు, ఏ2 శ్రవణ్ మాత్రం ఈ రోజు కోర్టు విచారణకు హాజరుకాలేదు.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
ముగిసిన మారుతీరావు అంత్యక్రియలు
[subscribe]