రెండు రోజుల ఏపీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు విశాఖపట్నం చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు ఆమె శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పొందూరులోని ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ది సంఘం (ఏఎఫ్కేకే) నిర్వహించిన కార్యక్రమానికి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఖాదీ కార్మికుల కోసం మాస్ షెడ్డుకు శంకుస్థాపన చేశారు.
అలాగే పొందూరు ఏఎఫ్కేకే సంఘానికి రూ.18 లక్షల చెక్కును అందజేశారు. ఖాదీ వర్కర్స్ అసోసియేషన్కు కొత్త భవనానికి సంబంధించిన ఒప్పంద పత్రాన్ని కూడా ఆమె అందజేశారు. అనంతరం దేశవ్యాప్తంగా చక్కటి చేనేత పనికి ప్రసిద్ధి చెందిన పొందూరులోని నేత కార్మికులతో ఆమె సంభాషించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రితో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ