హాజీపూర్ వరుస హత్యల కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దోషిగా తేలిన శ్రీనివాస్రెడ్డికి మరణశిక్ష విధిస్తూ ఫిబ్రవరి 6, గురువారం నాడు నల్గొండ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడి హతమార్చిన శ్రీనివాస్ రెడ్డిని నల్గొండ పోక్సో కోర్టు ముందుగా దోషిగా నిర్ధారించింది. అనంతరం శ్రీనివాస్ రెడ్డికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం 101 మంది సాక్షులను విచారించిన పోక్సో కోర్టు, నేరం రుజువుకావడంతో తాజాగా శిక్షను ఖరారు చేసింది. తీర్పు నేపథ్యంలో కోర్టు వద్దకు పెద్దఎత్తున చేరుకున్న హాజీపూర్ గ్రామస్తులు, ప్రజలు దోషి శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష పడడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు హాజీపూర్ గ్రామంలో బాధితుల కుటుంబసభ్యులు, బంధువులు, ఇతర గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. తమ గ్రామానికి చెందిన బాలికలపై అత్యాచారం చేసి అమానుషంగా చంపిన దోషి శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్షే సరైనదని వారు ఆనందం వ్యక్తం చేశారు.
[subscribe]