టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భద్రతను కుదించింది. ప్రస్తుతం నారాలోకేష్ కు కొనసాగిస్తున్న వై ప్లస్ కేటగిరి(2+2) భద్రతను తగ్గిస్తున్నట్లు ఫిబ్రవరి 6, గురువారం నాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఇకపై లోకేష్ కు 1+1 భద్రత మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. లోకేష్ కు ఇలా ఆకస్మికంగా భద్రతను తగ్గించడం గత ఎనిమిది నెలల్లో ఇది రెండోసారి కావడం విశేషం. ముందుగా జెడ్ కేటగిరీ నుంచి వైప్లస్కి భద్రతను తగ్గించగా, తాజాగా వైప్లస్ నుంచి ఎక్స్ కేటగిరీకి (1+1) మార్పు చేస్తునట్టు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన భద్రత విషయంలో లోపాలను ప్రస్తావిస్తూ లోకేష్ ఇప్పటికే 8 సార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు.
[subscribe]