ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కే కవిత సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె 10గంటలకు పైగా విచారణను ఎదుర్కొన్నారు. సోమవారం ఉదయం 10.25 గంటలకు ఈడీ కార్యాలయంలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్సీ కవిత తిరిగి రాత్రి 9.10 గంటలకు బయటకు వచ్చారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఈడీ అధికారులు వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మంగళవారం కూడా మరోసారి ఈడీ విచారణకు రావాల్సిందిగా సమన్లు జారీ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో మంగళవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ కవిత ఏజెన్సీ కార్యాలయం ఎదుట హాజరవనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
కాగా మార్చి 20న ఈడీ విచారణకు రావాల్సిందిగా ఈనెల 16న ఆమెకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కవిత సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. అయితే అంతకుముందు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్ను ఉటంకిస్తూ గురువారం ఈడీ ఇంటరాగేషన్కు హాజరు కావడానికి కవిత నిరాకరించడంతో ఫెడరల్ ఏజెన్సీ తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ అంశం ఇంకా సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉందని విచారణ సంస్థకు తెలియజేసేందుకు కవిత విచారణకు హాజరుకాలేదు. అయితే తన న్యాయ ప్రతినిధి ద్వారా విచారణ ఏజెన్సీ కోరిన అవసరమైన పత్రాలను పంపారు. ఇక అనంతరం మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వగా.. నిన్న విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ఢిల్లీ చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు మద్దతుగా నిలిచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE