తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను మంగళవారం నాడు హైదరాబాద్ లోని ప్రగతిభవన్లో శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ (చెన్నై) డాక్టర్ డి.వెంకటేశ్వరన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వ విధానాలు, ఐటీ, పరిశ్రమలు, సహా వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి మంత్రి కేటీఆర్ ఆయనకు వివరించారు. అలాగే పెట్టుబడులకై తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను డి.వెంకటేశ్వరన్ అభినందించారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ