మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకున్న సంగతి తెలిసిందే. కాగా దుబ్బాకలో రేపు ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితం వెల్లడించనున్నారు. కౌంటింగ్ కోసం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుండగా, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, 8.30 గంటల నుంచి ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మొత్తం 14 టేబుల్స్ లో 14 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.
దుబ్బాక పోరులో 23 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత, బీజేపీ తరపున సీనియర్ నాయకుడు ఎం.రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ ఉపఎన్నికలో పోటీపడ్డారు. మూడు పార్టీల కీలక నేతలు కూడా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడంతో పాటుగా విమర్శలు, సవాళ్లుతో సాగడంతో ఈ ఉపఎన్నికపై రాష్ట్ర ప్రజల్లో ప్రజల్లో నెలకుంది. దుబ్బాకలో ప్రజా తీర్పు ఎవరివైపు ఉండబోతుందో మరికొన్ని గంటల్లో తేలనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ