దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో “వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ” పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారిక గుర్తింపును ప్రకటించింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఈసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లోటస్ పాండ్లో గల పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి షర్మిల కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్, తల్లి వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు. మరోవైపు పార్టీకి అధికారిక గుర్తింపు రావడంతో గురువారం ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయంలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ