వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో ఫిబ్రవరి 21, శుక్రవారం నాడు జరిగే మహాశివరాత్రి మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితోపాటుగా, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, వేములవాడ ఆలయ ఈవో, పూజారులు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలుసుకుని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈసందర్భంగా ఆలయ పూజారులు రాజరాజేశ్వర స్వామి ప్రసాదాన్ని సీఎం కేసీఆర్ కు అందజేశారు.
[subscribe]