ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఫిబ్రవరి 18, మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎఫ్సీఐ నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లుగా తెలుస్తుంది. కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ, ఎఫ్సీఐ గోడౌన్లలో ధాన్యం నిల్వలను ఖాళీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశామని చెప్పారు. అలాగే కేంద్రం ఇప్పటివరకు 92 లక్షల కార్డులను మాత్రమే గుర్తించిందని, రాష్ట్రంలో మొత్తం 1.30 కోట్ల కార్డులను గుర్తించాలని కేంద్రమంత్రిని కోరినట్టు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి వివరించిన పలు సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సానుకూలంగా స్పందించారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
[subscribe]