బోయినపల్లి కిడ్నాప్ కేసులో చంచల్గూడ జైలులో రిమాండులో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ శనివారం నాడు విడుదల అయ్యారు. సికింద్రాబాద్ కోర్టు ఆమెకు శుక్రవారం నాడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 15 రోజులకు ఓసారి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో సంతకం చేయడం సహా మరికొన్ని ఇతర షరతులను కోర్టు విధించింది. అఖిలప్రియ విడుదల సందర్భంగా ఆమె బంధువులు, అనుచరులు పెద్దఎత్తున తరలిరావడంతో చంచల్గూడ జైలు పరిసరాల్లో సందడి నెలకుంది.
బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ1గా భూమా అఖిలప్రియ, ఏ2 గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ3 గా భార్గవ రామ్ తో పాటుగా మరికొందరిని పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, కోర్టు అనుమతితో కస్టడీలోకి కూడా తీసుకుని విచారించారు. ఆమె ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలనీ ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, పలు విడతల విచారణ అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ