వెంగయ్య కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన పవన్, ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు

Pawan Kalyan Meets Janasena Activist Vengaiah Family at Ongole

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. వెంగయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీ తరపున 8 లక్షల 50 వేల రూపాయల ఆర్థికసాయం అందించి, వెంగయ్య పిల్లల చదువుల బాధ్యతను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతరం ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి పవన్ కళ్యాణ్ వినతి పత్రం సమర్పించారు. వెంగయ్య నాయుడు ఆత్మహత్య సంఘటనపై విచారణ జరిపి, ఆత్మహత్యకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ముందుగా తన గ్రామానికి వచ్చిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును డ్రైనేజీ బాగుచేయడంపై వెంగయ్య ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, వెంగయ్య మధ్య జరిగిన సంభాషణ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అనంతరం వచ్చిన ఒత్తిడులు నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురై వెంగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో కార్యకర్తల్లో ధైర్యం నింపే దిశగా పవన్ కళ్యాణ్ ఒంగోలు చేరుకొని వెంగయ్య కుటుంబాన్ని కలుసుకుని ధైర్యం చెప్పి, సహాయం అందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + twelve =