తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు- 2021 వరించిన విషయం తెలిసిందే. గోరటి వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి ఈ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్ చేతుల మీదుగా గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ముందుగా భారతదేశంలో అత్యంత సమగ్రమైన సాహిత్య ఉత్సవం మార్చి 10, శుక్రవారం నాడు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. అందులో భాగంగా సాయంత్రం కోపర్నికస్ మార్గ్లోని కమనీ ఆడిటోరియంలో 24 మంది అవార్డు విజేతలకు ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి ప్రముఖ మరాఠీ కవి, విమర్శకులు డా.భాల్చంద్ర నెమాడే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్.చంద్రశేఖర్ కంబార్ అవార్డు గ్రహీతలకు అవార్డులను అందజేశారు.
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో పుట్టిన గోరటి వెంకన్న ఎన్నో పల్లె పాటలతో ప్రజలను అలరించారు. అచ్చ పల్లె పదాలతో పుస్తకాలు రచించి, ప్రజలను చైతన్యపరిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక కవిగా ఆయన తనదైన పాత్ర పోషించారు. ఇక సాహిత్య అకాడమీ అవార్డు కింద పతకం, శాలువాతో పాటు లక్ష రూపాయల నగదును బహుమతిగా అందిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ