మార్చి 9వ తేదీన భారత్ కు సంబంధించిన ఓ మిస్సైల్/క్షిపణి పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి కూలిపోయింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు క్షిపణి దూసుకెళ్లడంపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. “మార్చి 9, 2022న సాధారణ నిర్వహణ సమయంలో, సాంకేతిక లోపంతో ప్రమాదవశాత్తు ఒక క్షిపణి దూసుకెళ్లింది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది మరియు ఉన్నత స్థాయి కోర్టు విచారణకు ఆదేశించింది. ఈ క్షిపణి పాకిస్థాన్ లోని ఓ ప్రాంతంలో పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తీవ్ర విచారం కలిగించినా, ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కూడా ఊరటనిచ్చే అంశం” అని కేంద్ర రక్షణ శాఖ ప్రకటనలో పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ