టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూశారు. సెప్టెంబర్ 21, మంగళవారం తెల్లవారుజామున చెన్నైలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఈశ్వర్ పబ్లిసిటీ డిజైనర్గా సినీరంగంలో 4 దశాబ్దాలుగా సేవలందిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో 2600 పైగా చిత్రాలకు పోస్టర్లను డిజైన్ చేశారు.
చిన్నతనం నుంచి బొమ్మలు గీయడమంటే ఎంతో ఆసక్తి ఉండడంతో ఈశ్వర్ క్రమంగా ఆ వృత్తిలోకి అడుగుపెట్టారు. దిగ్గజ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి సినిమాతో పబ్లిసిటీ డిజైనర్ గా ఆయన సినీ ప్రస్థానం ప్రారంభించారు. కెరీర్ ప్రారంభం నుంచి అనేకమంది అగ్ర హీరోల చిత్రాలకు పనిచేయడమే కాకుండా, ప్రస్తుతం అగ్ర నిర్మాణ సంస్థలగా ఉన్న అనేక సంస్థల లోగోలను కూడా ఆయన డిజైన్ చేశారు. ఈశ్వర్ మృతి పట్ల పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ