ఈ యాసంగిలో వరి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం రికార్డు నెలకొల్పిందని పుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) వెల్లడించింది. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 83.01 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని ఎఫ్సీఐ సేకరించగా, అందులో తెలంగాణ వాటానే 52.23 లక్షల టన్నులు ఉందని తెలిపింది. ఈసారి దేశంలో 91.07 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, అందులో సగం కంటే ఎక్కువగా తెలంగాణ నుంచే సేకరించినట్టు ఎఫ్సీఐ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu