సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో శనివారం నాడు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామికవాడలోని వింధ్యా ఆర్గానిక్ కంపెనీలో అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన కొందరు కార్మికులు బయటకు పరుగులు తీయగా, మరికొంతమంది కంపెనీలోనే చిక్కుకున్నట్లు తెలుస్తుంది. రియాక్టర్లో పేలుడు కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఏడుగురు కార్మికులను సమీప ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటానస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పోలీసులు, ఇతర సహాయ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. అయితే కంపెనీ వద్ద భారీగా పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ