డిసెంబర్ 9, బుధవారం నాడు 80 దేశాలకు చెందిన విదేశీ రాయబారులు మరియు హైకమిషనర్లు హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తుంది. ఈ పర్యటనలో విదేశీ రాయబారులు దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికై పనిచేస్తున్న హైదరాబాద్ లోని భారత బయోటెక్ లిమిటెడ్ మరియు బయోలాజికల్ సంస్థ పరిశ్రమ యూనిట్లను సందర్శించనున్నారు. విదేశీ రాయబారుల పర్యటనకు సంబంధించి కోవిడ్-19 ప్రోటోకాల్ కు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని సౌకర్యాలతో కూడిన 5 బస్సులు, ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వారికీ రాష్ట్రంలో వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించి హైదరాబాద్ ప్రత్యేకతను తెలిపే విధంగా ఫార్మాసిటీ మరియు జెనోమ్ వ్యాలీ వివరాలతో కూడిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ