సీపిఎం పార్టీ అగ్రనేత, మధిర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. యుక్తవయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన కట్టా వెంకటనర్సయ్య సీపీఎం పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఖమ్మం జిల్లాలో సీపీఎం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం తరపున ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కట్టా వెంకటనర్సయ్య మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి సీపీఎం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ