గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నగారా మోగడంతో మళ్ళీ ప్రధాన రాజకీయ పార్టీల్లోకి చేరికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్, కాంగ్రెస్ నేత బండ కార్తీక రెడ్డి బుధవారం నాడు బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంచార్జిగా నియమితులైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ల సమక్షంలో కార్తీక రెడ్డి మరియు ఆమె భర్త చంద్రారెడ్డి బీజేపీలో చేరారు. భూపేంద్ర యాదవ్ వారికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కార్తీక రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తనకు రెండుసార్లు ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పారు. సిద్ధాంతాలకు అనుగుణంగా నడిచే బీజేపీలో న్యాయం జరుగుతుందని భావిస్తూ పార్టీలో చేరినట్లు చెప్పారు. కాగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని, మొత్తం 150 డివిజన్లలో పార్టీ తరఫున ప్రచారం చేస్తానని కార్తీక రెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ