జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కు రెండవసారి నిర్వహించిన కరోనా వైద్య పరీక్షల్లో నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. జూన్ 11 న బొంతు రామ్మోహన్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తికీ కరోనా పాజిటివ్ గా వచ్చినట్టు తేలడంతో, కుటుంబ సభ్యుల సహా ఆయన స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా, నివేదికల్లో నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా వారం క్రితం కూడా మేయర్ కు ఓసారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. నగరంలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రోడ్డు పక్కన ఓ హోటల్లో అధికారులతో కలిసి టీ త్రాగగా, ఆ హోటల్లో పనిచేసిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆయన మొదటిసారిగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu