జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ : మధ్యాహ్నం 1 గంట వరకు 18.20 % పోలింగ్‌ నమోదు

GHMC Polling Updates: Up To 1PM 18.20 Percent Polling Reported,GHMC Polling Updates,GHMC Elections Hyderabad 2020 Live Updates,GHMC Polls Updates,GHMC Election 2020 Live Updates,GHMC Polls,Hyderabad Polls,GHMC Elections,GHMC Elections 2020,Greater Hyderabad Municipal Corporation,GHMC Elections Voting,GHMC Elections Latest News,GHMC Elections Updates,GHMC Elections Live Updates,GHMC Polling Latest Update,GHMC Up To 1PM 18.20 Percent Polling Reported,Mango News,Mango News Telugu

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కొద్దిగా మందకొడిగా సాగిన పోలింగ్ క్రమంగా ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు 18.20 % పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రజలు ఓటుహాక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా బస్తీల్లో ప్రజలు పోలింగ్ లో చురుకుగా పాల్గొంటునట్టు తెలుస్తుంది.

మరోవైపు ఓల్డ్ మ‌ల‌క్‌పేట డివిజ‌న్‌లో బ్యాలెట్ పత్రంపై సీపీఐ, సీపీఎం పార్టీల అభ్య‌ర్థుల గుర్తులు తారుమారు కావడంతో అక్కడ పోలింగ్ ను రద్దు చేశారు. ఈ విషయంపై అందిన ఫిర్యాదులను పరిశీలించి ఓల్డ్ మ‌ల‌క్‌పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ను రద్దు చేస్తునట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్కడ నవంబర్ 3 న రీపోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఓల్డ్ మ‌ల‌క్‌పేట డివిజ‌న్‌ లో రీపోలింగ్ కు నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్‌ను కూడా నిషేధిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థ‌సార‌ధి ప్రకటించారు. రీపోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాలని ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + eight =