తెలంగాణలో మరో 502 మందికి కరోనా పాజిటివ్

Covid-19 Updates in Telangana: 502 New Positive Cases and 3 Deaths Reported on Nov 30

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నాడు 46,597 శాంపిల్స్ పరీక్షించగా, 502 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు.‌ దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,70,318 కి చేరింది. అలాగే కరోనాతో మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1461 కి పెరిగింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 101, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 46, భద్రాద్రి కొత్తగూడెంలో 33, రంగారెడ్డిలో 32, ఖమ్మంలో 30, కరీంనగర్ లో 25, వరంగల్ అర్బన్ లో 24, నల్గొండలో 23, సూర్యాపేటలో 19 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 30, రాత్రి 8 గంటల వరకు) :

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 55,00,058
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 2,70,318
  • కొత్తగా నమోదైన కేసులు : 502
  • నమోదైన మరణాలు : 3
  • రికవరీ అయిన వారి సంఖ్య : 2,59,230
  • కరోనా రికవరీ రేటు: 95.89%
  • యాక్టీవ్ కేసులు: 9,627
  • హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నవారి సంఖ్య: 7,586
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 1461
  • కరోనా మరణాల రేటు: 0.54%

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =