భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. అలాగే పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాలను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా నెక్లెస్ రోడ్డులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 26 అడుగుల పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. అనంతరం పీవీ విగ్రహానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ మార్గ్ ను కూడా గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీవీ కుటుంబ సభ్యులు, పీవీ శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు, కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ