తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 అవార్డుకు ఎంపికయ్యారు. యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ డాని కే.డేవిస్ నేతృత్వంలోని మల్టీ ఎథ్నిక్ అడ్వయిజరి టాస్క్ ఫోర్స్ జ్యూరీ ఈ అవార్డుకు డా.తమిళిసై సౌందరరాజన్ ను ఎంపిక చేశారు. గవర్నర్ కు జ్యూరీ పంపిన అభినందనాత్మక లేఖలో మహిళల హక్కులు, జెండర్ సమానత్వం, మహిళల సమానత్వం కోసం మరియు సమాజం హితం కోసం అత్యున్నత సేవలు అందించినందున ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై తో పాటుగా అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. మార్చి 7 న అమెరికా ఇల్లినాయిస్ లోని నాపరివిల్లేలో 9 వ కాంగ్రెషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గాలా సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ