ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు మార్చి 10 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్పొరేషన్ దక్కించుకునేందుకు అధికార వైఎస్సార్సీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిని టీడీపీ పార్టీ ప్రకటించింది. టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్ నుంచి ఈ ఎన్నికల్లో కేశినేని శ్వేత పోటీ చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ