తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున సమ్మక్క- సారక్క జాతరకు తరలివస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్లు, ఎర్రబెల్లి దయాకర్ రావు, అధికారులు ఇరు రాష్ట్రాల గవర్నర్లకు ఘనంగా స్వాగతం పలికారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు ఎత్తు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించి గవర్నర్లు మొక్కులు చెల్లించుకున్నారు.
ఫిబ్రవరి 6, గురువారం రాత్రి కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్కను చిలకల గుట్ట నుంచి మేడారానికి తీసుకువచ్చి, గద్దెపై ఆసీనురాలయ్యాక భక్తుల రద్దీ మరింత పెరిగింది. కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో వేచిఉన్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రులు జాతరలో ఏర్పాట్లును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
[subscribe]