తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రస్తుతమున్న సచివాలయం కూల్చివేత నిర్ణయంపై జూన్ 29, సోమవారం నాడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కూల్చివేతపై దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ, ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తుది తీర్పు వెలువరించింది. నూతన సచివాలయ నిర్మాణంపై రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని కోర్టు పేర్కొంది. అలాగే కూల్చివేతపై మంత్రివర్గ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విపక్ష కాంగ్రెస్ నేతలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లంటినీ కోర్టు కొట్టివేసింది. దీంతో నూతన సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సచివాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu