తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 975 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 29, సోమవారం నాటికీ మొత్తం కేసుల సంఖ్య 15,394 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 2648 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన ఆరుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 253 కి పెరిగినట్టు తెలిపారు.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 410 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 5582 కి చేరింది. ప్రస్తుతం 9559 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 861, రంగారెడ్డి లో 40, మేడ్చల్ లో 20, సంగారెడ్డిలో 14, కరీంనగర్ లో 10, భద్రాద్రి కొత్తగూడెంలో 8 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu