వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం రేపు (మార్చి 15, మంగళవారం) జరగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని కమిటీ హాల్-1లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రణాళికపై సీఎం జగన్ చర్చించనున్నట్టు తెలుస్తుంది. పార్టీ ప్లినరీ నిర్వహణ, త్వరలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశమున్నట్టు సమాచారం. అలాగే ప్రభుత్వం పెద్దఎత్తున చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లేలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ