ఇటీవల హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురియడంతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలకు మద్దతుగా పలు సంస్థలు, పలువురు ప్రముఖులు తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద భాదితులను ఆదుకునేందుకు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు రూ.5 కోట్ల భారీ విరాళాన్ని ప్రభుత్వానికి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్కు రామోజీ గ్రూప్ ప్రతినిధి గురువారం నాడు అందజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu