వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా డిసెంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నవంబరు 24, గురువారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనునున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
మరోవైపు 2022, నవంబర్ 21న మొత్తం 70,163 యాత్రికులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు. 31,489 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ కానుకలు రూ.5.22 కోట్లు వచ్చినట్టు తెలిపారు. అలాగే స్వామివారి దర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE