మునుగోడు కౌంటింగ్ అప్‌డేట్స్ : నాలుగో రౌండ్ అనంతరం ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి

Munugode Bye-election Vote Counting: TRS Party in Lead after 4th Round, Munugode Bye-election Vote Counting, TRS Party in Lead after 4th Round,TRS Party Candidate Kusukuntla Prabhakar Reddy,Munugode Bye-election,Mango News,Mango News Telugu, Munugode Bypoll, Munugode Bypoll Elections, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode Election Schedule Release, Telangna Bjp Party, Telangna Congress Party, Trs Cadre For Working In Munugode By-Poll, Trs Working President Ktr, Munugode By-Poll, Ysrtp

రౌండ్స్ వారీగా ఓట్లు:

బీజేపీ: తొలిరౌండ్ (5126), రెండో రౌండ్ (8622), మూడో రౌండ్ (7426), నాలుగో రౌండ్ (4555)
టీఆర్ఎస్ : తొలిరౌండ్ (6418), రెండో రౌండ్ (7781), మూడో రౌండ్ (7390), నాలుగో రౌండ్ (4854)

మునుగోడు కౌంటింగ్ ప్రక్రియలో నాలుగో రౌండ్ ముగిసింది. నాలుగో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 26443, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 25729, కాంగ్రెస్ అభ్య‌ర్థి పాల్వాయి స్రవంతికి 7380 ఓట్లు లభించాయి. నాలుగు రౌండ్ల అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి 714 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రౌండ్ లో బీజేపీకి 4555, టీఆర్‌ఎస్ కు‌ 4854, కాంగ్రెస్‌కి ‌1817 ఓట్లు లభించాయి.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొల్పిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. నల్గొండ పట్టణ శివారులోని ఆర్జాలబావి వద్ద ఉన్న స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గౌడౌన్స్ లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ముందుగా 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించా రు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుండగా, ఒకే హళ్లో 21 టేబుళ్లపై కౌంటింగ్ జరుగనుంది. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్‌ కేంద్రాల చొప్పున కౌంటింగ్‌ చేపట్టనున్నారు. ఇక గంటకు 3 నుంచి 4 రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అలాగే 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కించనున్నారు. పూర్తిస్థాయి కౌంటింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూర్తయి, ఎవరు విజయం సాధించారో ప్రకటన విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. మునుగోడు నియోజకవర్గంలో నవంబర్ 3న జరిగిన పోలింగ్ లో రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైంది. మునుగోడు నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా, 93.13 శాతం అనగా 2,25,192 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ముందుగా తొలి రౌండ్‌ చౌటుప్పల్‌ మండలం నుంచి ప్రారంభమైంది. అనంతరం నియోజకవర్గపరిధిలోని నారాయణపురం, మునుగోడు, చండూరు, గట్టుప్పల్‌, మర్రిగూడెం, నాంపల్లి, మండలాలలో పోలైన ఓట్లను లెక్కించనున్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

మునుగోడు పోరులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీజేఎస్ సహా వివిధ పార్టీలు, అలాగే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, ఇతర స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 47 మంది బరిలో నిలిచినప్పటికీ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. మునుగోడులో ప్రజా తీర్పు ఎవరివైపు ఉండబోతుందో, ఏ పార్టీ జెండా ఎగురవేయబోతుందో మరికొన్ని గంటల్లో తేలనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + eight =