హైదరాబాద్లో ఈరోజు ‘మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్’ ప్రారంభమైంది. శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సీతాదయాకర్ రెడ్డి మరియు ఉమా మాధవరెడ్డి హాజరయ్యారు. మహిళా జర్నలిస్టుల కొరకు ఒక ప్రత్యేక మీడియా సెంటర్, మీడియా కిట్ సాధించుకోవడంతో పాటు, మహిళా జర్నలిస్టుల సమస్యలు వాటి పరిష్కారాల కొరకు ప్రత్యేక చర్చ ఉంటుందని అల్లం నారాయణ తెలిపారు. మహిళల కోసం మహిళా జర్నలిస్టులు ఈ వర్క్ షాప్ ను నిర్వహించడానికి మీడియా అకాడమీ ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ శనివారం నుంచి ఆదివారం వరకు రెండు రోజులు పాటు నిర్వహించనున్నారు. ఇందులో దాదాపు 400 మంది వరకు మహిళా జర్నలిస్టులు పాల్గొంటున్నారు. జాతీయ మహిళా జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్, మాలిని సుబ్రహ్మణ్యం కీలక అంశాలపై తమ ప్రసంగించనున్నారు. రేపు జరిగే ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ