దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనాబారిన పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “తేలికపాటి లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. ఇటీవల నాతో సంప్రదించిన వారందరూ, దయచేసి అన్ని కరోనా భద్రతా ప్రోటోకాల్లను అనుసరించండి మరియు సురక్షితంగా ఉండండి” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ