తెలంగాణలో లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు జానారెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, మల్లురవి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.
భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన జవహర్ లాల్ నెహ్రు పై బీజేపీ పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నో విషయాల్లో బీజేపీ పార్టీ చరిత్రను వక్రీకరిస్తున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రము ఇచ్చింది, సాధించింది కాంగ్రెస్ పార్టీయే అని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయం కోసం కృషి చేయాలనీ పార్టీ నాయకులకు, శ్రేణులకు విజ్ఞప్తి చేసారు.
[subscribe]
[youtube_video videoid=t5wvxvxA47M]