ఆదివాసీలకు జనసేన పార్టీ నిరంతరం అండగా ఉంటుందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ఆదివాసీలు పాడిన ఓ పాటను ట్విట్టర్ లో షేర్ చేశారు. “జనసేన పోరాట యాత్రలో భాగంగా అరకు పర్యటనలో ఆదివాసీల జీవన పరిస్థితులు బాధ కలిగించినాయి. ఆదివాసీల సంస్కృతి పరిరక్షింపబడాలి, వారి జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావటానికి జనసేన-జనసైనికులు నిరంతరం వారికీ అండగా ఉంటాం. బుధవారం వకీల్ సాబ్ షూటింగ్ విరామంలో, అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియాలో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ‘వనవాసి’ గుర్తుకువచ్చింది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
నిన్న ‘వకీల్ సాబ్’ షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ‘ వనవాసి’ గుర్తుకువచ్చింది) pic.twitter.com/CkgNP3PSMA
— Pawan Kalyan (@PawanKalyan) December 24, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ