కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పలు పరీక్షలు, వృత్తి విద్యా, సాంకేతిక విద్యకు సంబంధించి పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ కరోనా లాక్డౌన్ వలన ఏర్పడ్డ పరిణామాలతో పరీక్షల విధానంలో జేఎన్టీయూ-హైదరాబాద్ కీలక మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో పరీక్షల సందర్భంగా ఒక కాలేజీ విద్యార్థులు మరో కాలేజీలో పరీక్షలు రాసేవారు. కాగా ఇప్పుడు విద్యార్థులు చదువుతున్న కాలేజిలోనే పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు పరీక్ష సమయాన్ని కూడా 3 గంటల నుంచి రెండు గంటలకు కుదించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ముందుగా ఇంజనీరింగ్ ఫైనల్ సంవత్సరం విద్యార్థులకు జూన్ 20 నుంచి, ఆ తర్వాత మిగతా సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్-2020 పరీక్షను జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu