ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకూ మరింతగా పెరుగుతూ ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల 35 వేల మందికి పైగా కరోనా బారిన పడగా, ఈ వైరస్ వలన మరణించిన వారి సంఖ్య 2,97,251 కి చేరుకుంది. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం అమెరికా, చైనా, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, బ్రెజిల్, ఫ్రాన్స్ , ఇరాన్, బెల్జియం, రష్యా, జర్మనీ, టర్కీ, భారత్ దేశాలపై ఎక్కువుగా ఉంది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్యలో భారత్ ప్రస్తుతం చైనా కంటే దిగువున 12 వ స్థానంలో ఉంది.
కరోనా వైరస్ వలన అమెరికాలో 84,763 మంది, బ్రిటన్లో 33,186 మంది, ఇటలీలో 31,106 మంది, స్పెయిన్లో 27,104 మంది, ఫ్రాన్స్లో 27,074 మంది, బ్రెజిల్లో 13,240, బెల్జియం లో 8843, జర్మనీలో 7861, ఇరాన్ లో 6783, చైనాలో 4633, భారత లో 2549 మంది మరణించారు. మొదట్లో కరోనా నియంత్రణకు లాక్డౌన్ విధించిన పలు దేశాలు, ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ లాక్డౌన్ ఎత్తివేస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu