తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 వ తేదికి ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009న ఉద్యమ నేతగా, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో గొప్ప మలుపుగా నిలిచిపోయింది. దీంతో ప్రతి సంవత్సరం నవంబర్ 29 వ తేదీని టిఆర్ఎస్ పార్టీ ‘దీక్షా దీవస్’గా నిర్వహిస్తుంది. సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షకు నేటితో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజానీకానికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “దీక్షా దివస్-నవంబర్ 29, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష. తెలంగాణ ప్రజానీకానికి దీక్షా దివస్ శుభాకాంక్షలు” అని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.
“దీక్షా దివస్-నవంబర్ 29″
తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష 🙏
తెలంగాణ ప్రజానీకానికి దీక్షా దివస్ శుభాకాంక్షలు
జై కేసీఆర్! జై తెలంగాణ pic.twitter.com/DcIRaWbeAi
— KTR (@KTRTRS) November 29, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ