అలనాటి తెలుగు అగ్ర నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ మరియు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ ట్యాంక్ బండ్ సమీపం లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. శనివారం వేకువఝామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆయన సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు జాతికి, తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కుమార్తె, అల్లుడు దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులు కూడా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని ఘనంగా నివాళులు అర్పించారు. సినీనటి, టీడీపీ నేత దివ్యవాణి, దైవాజ్ఞ శర్మ సహా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పలువురు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ