కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని రోజుల క్రితం తహసీల్దార్ నాగరాజు ఓ భూవ్యవహారంలో ఓ వ్యక్తి నుండి ఒక కోటి 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన అవినీతి, లంచం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన చంచల్గూడ జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుపై ఏసీబీ విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో చంచల్గూడ జైలులోనే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. నాగరాజు మృతదేహాన్ని అధికారులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu