కాంగ్రెస్ సర్కార్‌పై భగ్గుమన్న కేటీఆర్

KTR, BRS, Congress Government, Revanth reddy, Telangana Politics, TRS, Telangana, Revanth Reddy News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Mango News Telugu, Mango News
KTR, BRS, Congress Government, Revanth reddy, Telangana Politics

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే లోక్ సభ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరేందుకు తమ వంతుగా అత్యధిక స్థానాలు అందివ్వాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయిన బీఆర్ఎస్‌ను.. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఓడించి దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోంది.

అదే సమయంలో అటు బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ద్వారా నేర్చుకున్న పాఠాలతో గులాబీ బాస్ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నుంచి నరుక్కురావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అలాగే తెలంగాణలో మెజార్టీ స్థానాలు దక్కించుకొని కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ పరిణామాల మధ్య తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్‌పై పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల సర్కార్ అని.. చేతల ప్రభుత్వం కాదని ప్రజలు గుర్తించారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ గ్యారెంటీలు, నేతల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పుకొచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ మంచికే జరిగిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చీకటిలో ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని చెప్పారు. 100 రోజుల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయకపోతే.. కాంగ్రెస్‌ను బొంద పెట్టుడు గ్యారెంటీ అని భగ్గుమన్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రేవంత్ రెడ్డి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న కేటీఆర్.. ఆయన భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డిలా తమకు కూడా తిట్టడం వచ్చిని.. కానీ తమకు సభ్యత ఉందని పేర్కొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాలను దక్కించుకొని తీరుతామని కేటీఆర్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + three =