కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర ప్రారంభం

Col Bikkumalla Santosh Babu, Col Santosh Babu, Colonel Santosh Babu, colonel santosh babu bihar regiment, Colonel Santosh Babu Last Rites, India China border clash, Indian Army Soldier Santosh Babu, Last Rites Colonel Santosh Babu, Last Rites Colonel Santosh Babu Started at Suryapet, Martyr Colonel Santosh Babu, Martyrdom of Col Bikkumalla Santosh Babu

భారత్‌-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేటకు చెందిన కల్నల్ ‌బిక్కుమల్ల సంతోష్‌ బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహం బుధవారం రాత్రి సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన స్వగృహానికి చేరుకుంది. గురువారం ఉదయం పలువురు ప్రముఖ నాయకులు, స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని సంతోష్‌బాబు భౌతికకాయానికి నివాళులర్పించారు.

అనంతరం ఆయన స్వగృహం నుంచి కల్నల్‌ సంతోష్‌బాబు అంతిమయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా ప్రజలు పూలు చల్లుతూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మరి కాసేపట్లో వారి కుటుంబానికి చెందిన కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో సంతోష్‌బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. సంతోష్ బాబు‌ అంత్యక్రియలకు ఆర్మీ మేజర్లు, కల్నల్స్‌, రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఉన్నత అధికారులు హాజరుకానున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + four =