తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 269 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 269 కేసులతో కలిపి జూన్ 17, బుధవారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5675 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు మొత్తం 1,096 మందిని పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన ఒకరు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 192 కి పెరిగినట్టు తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా జీహెచ్ఎంసీ ఏరియాలో 214 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్ అర్బన్ లో 10, కరీంనగర్లో 8, జనగామ, ములుగులో 5 కేసులు చొప్పున, మెదక్, సంగారెడ్డి లలో 3 కేసులు చొప్పున, మేడ్చల్, వనపర్తి జిల్లాలలో 2 కేసులు చొప్పున, భూపాలపల్లి, కొమరం భీం అసిఫాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాలలో ఒక్కోకేసు చొప్పున మొత్తం 269 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 151 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3071 కి చేరింది. ప్రస్తుతం 2,412 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu